ధోనికి లాస్ట్ ఛాన్స్‌ : కుంబ్లే

466
dhoni
- Advertisement -

ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కు స్వల్ప విరామం ప్రకటించిన మహేంద్రసింగ్ ధోని భవితవ్యంపై సందిగ్దం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోని రీ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే.

టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఐపీఎల్ 2020 సీజన్ ధోనీకి ఆఖరి అవకాశమని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్‌ టీమ్‌లో ధోనీ ఉండాలని భారత అభిమానులు కోరుకుంటున్నారని చెప్పాడు. అయితే ఐపీఎల్‌లో ధోని ప్రదర్శనపై ఇది ఆధారపడి ఉంటుందని చెప్పాడు.

ధోని స్ధానంలో కేఎల్‌ రాహుల్‌కి వికెట్ కీపర్‌గా ఛాన్స్ ఉందన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటక టీమ్‌ తరఫున వికెట్ కీపింగ్ చేసిన అనుభవం రాహుల్‌కి ఉంది…దీనికి తోడు ఓపెనర్‌గాను ఉపయోగపడగలడని ఒకవేళ ధోని ఫెయిలైతే రాహుల్‌కి ఆ అవకాశం దక్కే సూచనలున్నాయని అని వెల్లడించాడు.

- Advertisement -