ఏపీలో కొత్తగా 8,239 పాజిటివ్ కేసులు నమోదు..

96
covid
- Advertisement -

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రతలో చాలావరకు తగ్గిందనే చెప్పాలి. గత కొద్ది వారాలుగా రాష్ట్రంలో కరోనా పాజిటీవ్‌ కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1,01,863 కరోనా పరీక్షలు నిర్వహించగా 8,239 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,396 కొత్త కేసులు వెల్లడయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 1,271 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 201 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 11,135 మంది కరోనా నుంచి కోలుకోగా, 61 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 10 మంది కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 11,824 మంది కొవిడ్ బారినపడి ప్రాణాలు విడిచారు. మొత్తం 17,96,122 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటిదాకా 16,88,198 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 96,100 మంది చికిత్స పొందుతున్నారు.

- Advertisement -