ఎన్టీఆర్‌కు గ్రీన్ ఛాలెంజ్ విసిరిన యాంకర్ సుమ..

858
ntr
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ మరియు యాంకర్ అనసూయ ఇచ్చిన చాలెంజ్‌ను యాంకర్‌ సుమ స్వీకరించి నేడు బేగంపేటలోని మయూరి బిల్డింగ్‌లో మూడు మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్భంగా యాంకర్ సుమ మాట్లాడుతూ.. మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం అని పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు మనకు ఊపిరి శ్వాస అని ఆ శ్వాససకు మూలం అయిన ఆక్సిజన్ అని ఆక్సిజన్ ఇచ్చే చెట్లను పెంచాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందన్నారు. చాలా కాలం తర్వాత గార్డెనింగ్ చేసే అదృష్టం కలిగిందని. ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్‌కి కృతజ్ఞతలు తెలిపారు. మొక్కల ఛాలెంజ్‌ను సెలబ్రిటీస్ ఇలాగే కంటిన్యూ చేయాలని కొరారు.

Anchor Suma Plants Saplings

భావితరాలు సుఖంగా ఉండాలి అన్న గ్లోబల్ వార్మింగ్ పోవాలన్న ప్రతి ఒక్కరు మొక్కలు పెంచాలని కొరారు. హరితహారంలో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇలాంటి కార్యక్రమాలను ఎంకరేజ్ చేయడం చాలా సంతోషకరమని సీఎం కేసీఆర్‌కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని సుఖాలు ఉన్న మనకు మంచి వాతావరణం ఉంటే ఆనందంగా ఉంటామని. “మొక్కలు నాటుదాం- ప్రకృతిని అందంగా ఉంచుదాం- మనందరం ఆనందంగా ఉందామని “ఈ సందర్భంగా పిలుపునిచ్చారు సుమ.

అదేవిధంగా నేను మరొక నలుగురిని ఛాలెంజ్‌లోకి ఆహ్వానిస్తున్నాను అందులో ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్, మంచు లక్ష్మి ,బిగ్ బాస్ షో 3 విజేత రాహుల్, యాంకర్ ఓంకార్ వీరు కూడా మొక్కలు నాటుతారు ఆశిస్తున్నాను అని తెలిపారు యాంకర్‌ తెలిపారు.

- Advertisement -