రూ.45లక్షలు ఇచ్చి  మోసపోయా..ఇప్పుడు నా మీద కేసు వేశాడుః యాంకర్ రవి

682
Anchor Ravi
- Advertisement -

యాంకర్ రవి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తనదైన మాటలు, డ్యాన్స్  లతో బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తున్నాడు. సమ్ ధింగ్ స్పెషల్ షో ద్వారా యాంకరింగ్ ప్రారంభించిన రవి..ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ యాంకర్ గా ఎదిగాడు. బుల్లితెరపై యాంకరింగ్ చేసుకుంటూనే అప్పుడప్పుడు వెండితెరపై కూడా నటిస్తున్నాడు. ఈ టీవీలో ప్రసారమయ్యే పటాస్ షో ద్వారా రవి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

తాజాగా తన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఓ షో చెప్పాడు రవి. తాను సినిమా చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడని..తనతో పాటు కొద్ది నెలలు ప్రయాణం చేసాడని..నా సొంత తమ్ముడిలా మా ఇంట్లో వాళ్లతో మాట్లేడేవాడని చెప్పాడు. దీంతో కొద్ది రోజుల తర్వాత వాళ్ల అమ్మకి ఓంట్లో బాలేదు సీరియస్ గా ఉంది అంటే వెంటనే రూ. 45లక్షలు ఇచ్చానని చెప్పాడు.

ఆ తర్వాత కొద్ది రోజులకు డబ్బులు అడుగుదామని ఫోన్ చేస్తే స్వీఛ్చాప్ చేసుకున్నాడని తెలిపాడు. రోజు ఫోన్ చేస్తున్నానని మూడు నెలల తర్వాత అతను నాపై కోర్టులో కేసు వేశాడని..అందువల్లే తాను ప్రస్తుతం కోర్టుల చుట్టు తిరగాల్సి వస్తుందని చెప్పాడు.  అమ్మ పేరు చెబితేనే అంత డబ్బు ఇచ్చానని…కానీ అతడు నన్ను మోసం చేశాడని ఓ షొ ద్వారా తెలిపాడు రవి.

- Advertisement -