గ్రీన్ ఛాలెంజ్‌..మొక్కలు నాటిన యాంకర్ రష్మి

556
anchor rashmi
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటారు యాంకర్ రష్మీ. నానక్‌రాంగూడలోని తన నివాసంలో మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు. ఈ సందర్భంగా రష్మీ మాట్లాడుతూ మొక్కలు మానవాలికి కావాల్సిన ప్రాణ వాయువైన ఆక్సిజన్ ను ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకుంటాయి. అంతే కాక పరిసరాలలో వున్న కుళ్ళు వాసనలను, కలుషితమైన గాలిని గ్రహించుకొని స్వచ్చపరుస్తాయని చెప్పారు.

మనస్సుంటే మొక్కలు నాటడానికి ఖాళీ స్థలం లేదనే ప్రసక్తి లేదన్నారు. మొక్కలు నాటి రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతను , వాతావరణ లో హెచ్చుతగ్గులను సమతుల్యత చేయడానికి మొక్కలు తప్పకుండా పెంచాలన్నారు . అందుకే తాను కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశానని తెలిపారు. యాక్టర్ సత్యదేవ్,అనసూయ ,శేఖర్ మాస్టర్ ని మొక్కలు నాటాల్సిందిగా కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని చేపట్టిన ఎంపీ సంతోష్‌కి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

rashmi rashmi

- Advertisement -