మొక్కలు నాటిన ప్రముఖ యాంకర్ చిత్రలేఖ

321
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా యాంకర్ వింధ్య మేడపాటి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు మాదాపూర్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు ప్రముఖ యాంకర్ చిత్రలేఖ.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పకృతి ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని బాధ్యతగా అందరూ మొక్కలు నాటి వాటిని రక్షించాలని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తన మిత్రులు యాంకర్ శిల్పా చక్రవర్తి; నటి శ్రీవాణి; నటుడు కోలా బాలకృష్ణ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -