‘యాత్ర’ నుండి అన‌సూయ ఫ‌స్ట్‌లుక్‌..

211
- Advertisement -

దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న చిత్రం యాత్ర. మహి.వి రాఘవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డిగా ఆయన లుక్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. ఇటీవ‌ల చిత్ర షూటింగ్ పూర్తి కాగా, డిసెంబ‌ర్ 21న మూవీ విడుద‌ల‌కి ప్లాన్ చేశారు.

Anchor Anasuya

అయితే ఈ చిత్రంలో అనసూయ ముఖ్య పాత్ర పోషించ‌గా, విలేక‌రి పాత్ర‌లో అన‌సూయ క‌నిపించ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. తాజాగా సెట్‌లో ఉన్న కుర్చీలో కూర్చొని ఉన్న‌ప్పుడు తీసిన ఫోటోని ట్విట్ట‌ర్ వేదిక‌గా షేర్ చేసింది అనసూయ‌. ఈ పిక్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

- Advertisement -