Wednesday, May 1, 2024
Home గాసిప్స్ టుడే సినీ తారల క్రేజీ పోస్ట్ లు!

టుడే సినీ తారల క్రేజీ పోస్ట్ లు!

45
- Advertisement -

టుడే ప్రజెంట్ కొందరు సినీ తారలు పెట్టిన సోషల్ పోస్ట్ వైరల్ అవుతున్నాయి. గ్లామర్ నటి అనసూయ మరోసారి రెచ్చిపోయింది. ఓ నెటిజన్ రష్మి గౌతమ్‌ను ఉద్దేశిస్తూ.. అనసూయ అంటీ అంటూ అనసూయను ట్యాగ్ చేశాడు. ఈ ట్వీట్‌కు అనసూయ విరుచుకుపడింది. హలో! దయచేసి మిమ్మల్ని కరెక్ట్ చేయడానికి నన్ను మాట్లాడనివ్వండి. అందరూ ఒకేలా ఉండాలనీ అనుకోవడం కరెక్ట్ కాదు కదా అంకుల్ ? అంటూ అనసూయ రిప్లై ఇచ్చింది.

అలాగే మరో మెగా డాటర్ నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ చేసిన ట్వీట్ కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. నిహారిక – చైతన్య విడిపోతున్నారనే విషయంపై ఇప్పటి వరకు ఇద్దరూ ఎక్కడ స్పందించలేదు. ఐతే, తాజాగా.. చైతన్య ఇన్‌ స్టాలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఓ మెడిటేషన్ సెంటర్ ఫోటోను షేర్ చేసిన చైతన్య.. నేను ఈ సెంటర్‌కు వచ్చేలా చేసిన వారందరికీ చాలా థాంక్స్. మనం ఎక్కడికైనా ఎలాంటి ఆలోచనలు లేకుండా వెళ్తే.. అద్భుతమైన జ్ఞానంతో తిరిగి వస్తాం. ఇది కూడా అలాంటిదే’ అని చైతన్య రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ ను బట్టి నిహారిక – చైతన్య మధ్య రిలేషన్ సరిగ్గా లేదని అర్థమవుతుంది.

బండ్ల గణేష్‌ ట్విట్టర్‌ వేదికగా సంచలన పోస్ట్‌ పెట్టాడు. పవన్ కళ్యాణ్ పేరు ఇక వాడుకోను అంటూ సంచలన ప్రకటన చేశాడు. మీ స్థాయి ఏంటో? మీ స్థానం ఏంటో? తెలిసిన వాడిగా చెబుతున్నాను. ఎప్పుడు ఏ విధంగా మీ కీర్తిని గానీ, మీ పేరుని వాడుకొని లబ్ధి పొందను, పొందటానికి కూడా ప్రయత్నించను. వీలైతే మీకు సహాయంగా ఉంటాను. లేకపోతే, దూరంగా ఉంటానని బండ్ల గణేష్‌ చెప్పారు.

అలాగే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో ఇన్ స్టాలో అభిమానులను పలకరించనున్నారు. అయితే ఈ విషయాన్ని ఆయన సోదరుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన ఇన్ స్టాలో ఓ పోస్టు పెట్టారు. అయితే, ఎంట్రీ ఎప్పుడనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఓవైపు వరుసగా సినిమాలు, మరోవైపు రాజకీయాలతో పవన్ కల్యాణ్ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

- Advertisement -