Jagadish Reddy:పేదలకు భరోసా బీఆర్ఎస్

55
- Advertisement -

గతంలో బీఆర్‌ఎస్‌కు వేసిన ఓటు కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. మరోసారి బీఆర్ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సూర్యాపేటలో తన సతీమణి సునితతో కలిసి మంత్రి జగదీశ్‌ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన జగదీష్ రెడ్డి..ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆ ఆకాంక్ష అన్నారు.కేసీఆర్‌ బీమా ప్రతి ఇంటికి ధీమా అని, అన్నపూర్ణ పథకం, ఆసరా పెన్షన్ల పెంపుతో మూడోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు.

పేద, మధ్యతరగతి ప్రజలకు బీఆర్ఎస్  మేనిఫెస్టో భరోసా అన్నారు. దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్‌, రైతుబంధు రూ.16 వేలు, అగ్రవర్ణ పేదలకు గురుకులాలు, కేసీఆర్‌ ఆరోగ్యరక్షకు రూ.15 లక్షలు, సౌభాగ్యలక్ష్మి రూ.3 వేలు ఇవ్వనున్నారని చెప్పారు.

Also Read:టీ కాంగ్రెస్‌కు కన్నడ లీడర్ల భయం!

- Advertisement -