సూపర్స్టార్ రజినికాంత్ నటించిన ‘రోబో’ సినిమా ఎంతటి సంచలన రికార్డ్ సాధించిందో అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్తో తెరతెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఎస్.శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే రోబోకి సీక్వెల్గా వస్తున్న’రోబో2.0′ సినిమాని దర్శకుడు శంకర్ ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.
అయితే ‘రోబో’లో కథానాయికగా మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యరాయ్ నటించి, ప్రేక్షకులను తన నటనతో మంత్రముగ్ధుల్ని చేసింది. ఇక రోబోకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా ‘ఎమీ జాక్సన్’ ఛాన్స్ కొట్టేసింది. ఈ హీరోయిన్ నటించిన ‘ఐ’ సినిమా ఎలాంటి టాక్ ని సంపాధించున్నా.. ఈ అమ్మడి అందాలకు మాత్రం ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే ఈ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నందుకు ఈ హీరోయిన్ తెగ సంబరపడిపోతూ.. ఈ సినిమా తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందని భావిస్తోంది. ఈ సినిమాను పూర్తిచేయడం కోసం ఈ బ్యూటీ చాలా సినిమాలు వదిలేసింది కూడా.
అయితే ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలోని ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు శంకర్. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తికావొస్తుండటంతో తమిళం నుంచి .. తెలుగు నుంచి చాలామంది దర్శక నిర్మాతలు ‘ఎమీ జాక్సన్’ ను సంప్రదిస్తున్నారట. ఈ హీరోయిన్ కూడా ఇక వరుసగా సినిమాలతో జిజీగా ఉండాలనే ఉద్దేశంతోనే ఉందని అంటున్నారు. మరి ఎమిజాక్సన్.. తన కోసం వెయిట్ చెస్తున్న వారిలో ఎవరికి ఛాన్స్ ఇస్తుందో చూడాలి. అలాగే ఈ రెండు భాషల్లోను ఈ సుందరి ఏయే స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేస్తుందో చూడాలి మరి.