మా నాన్న ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదుః అమృత

541
amrutha
- Advertisement -

ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అమృత తండ్రి మారుతి రావు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాసేపటి క్రితమే మిర్యాలగూడలో మారుతిరావు అంత్యక్రియలు ముగిశాయి. అయితే మారుతిరావు అంత్యక్రియలకు వెళ్లిన అమృతను స్ధానికులు, బంధువులు అడ్డుకున్నారు. చివరి సారిగా నాన్నను చూడకుండానే తిరిగి వెళ్లిపోయింది అమృత. మారుతీ రావు అంత్యక్రియలు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడింది అమృత. మా నాన్న ఆత్మహత్యే చేసుకున్నాడని తాను నమ్ముతున్నట్లు తెలిపింది. మా నాన్న ఆత్మహత్యకు కారణం తనకు తెలియదు. ఒక మనిషిని చంపించేంత ధైర్యమున్న మా నాన్న ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని నేను అనుకుంటున్నాను.

ప్రణయ్ ని చంపారు అని తప్ప..మా మధ్య వేరే గొడవలు లేవని స్పష్టం చేసింది. ప్రణయ్ లేకపోయినా నాకు అత్త, మామా,కొడుకు ఉన్నారు. కానీ మా అమ్మకు ఎవరు లేరు…మా అమ్మ నా దగ్గరకు వస్తే చూసుకుంటాను..కానీ నేను మాత్రం వాళ్ల ఇంటికి వెళ్లను అని చెప్పింది. మా బాబాయ్ శ్రవణ్ వల్ల మా అమ్మకు భవిష్యత్ ప్రమాదం ఉందని అనుంటున్నట్లు తెలిపారు. బాబాయ్ శ్రవణ్‌ కు మా నాన్న భయపడుతాడు. మారుతీరావు, శ్రవణ్ లకు మధ్య గొడవలు ఉన్నాయి. నా భర్తను చంపిన వారికి చట్టపరంగా శిక్ష పడాలని కోరుకున్నాను. ఆస్తుల విషయంలో మారుతీరావు, బాబాయి శ్రవణ్‌కు మధ్య గొడవలు ఉన్నాయి. మారుతీరావును శ్రవణ్‌ కొన్నిసార్లు కొట్టినట్లుగా నాకు తెలిసింది.

- Advertisement -