శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ బ్యానర్ లో నాగశౌర్య, బేబి షామిలి జంటగా కె.ఆర్ సహా నిర్మాతగా రాజేష్ నిర్మిస్తోన్న చిత్రం `అమ్మమ్మగారిల్లు`. సుందర్ సూర్య దర్శకత్వం తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవలె సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని క్లీన్ యు సర్టిఫికెట్ పొందింది. ఈనెల 25న భారీ ఎత్తున సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ఇప్పటివరకు విడుదలైన టీజర్కు మంచి స్పందన రాగా తాజాగా ట్రైలర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది చిత్రయూనిట్.
అమ్మమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ చిన్నప్పుడు నాగశౌర్య చెప్పే డైలాగ్తో మొదలైన ట్రైలర్ని ఫ్యామిలీ,యాక్షన్,రొమాంటిక్ ఎలిమెంట్స్ కలిపి తెరకెక్కించారు. జీవితంలో కలిసి రావాలంటే కూతురిని కనాలి తెలిసిరావాలంటే కొడుకుని కనాలి అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్ అందరిని ఆకట్టుకుంటోంది. హైదరాబాద్లో అమ్మాయలు లేరా ఈ కాకినాడ ఫిగర్ కావాలా అంటూ షామిలి చెప్పే డైలాగ్తో పాటు ఒక్క సెకన్ నవ్వితేనే పోటో బాగా వస్తుంది…అదే నవ్వుతూ జీవితాంతం గడిపిస్తే ఎంత బావుంటుంది అని నాగశౌర్య చెప్పిన డైలాగులు అలరిస్తున్నాయి. నిన్న విడుదలైన ఈ టీజర్ని ఇప్పటివరకు 3 లక్షల అరవై వేల మంది చూశారు. ప్రస్తుతం యూ ట్యూబ్ ట్రెండింగ్లో 7వ స్ధానంలో నిలిచింది.
ఓయ్ సినిమా తర్వాత షామిలీ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రిలేషన్ నెవెర్ ఎండ్ అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ మూవీ రూపొందింది. తెరపై సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ కు థియేటర్ లో ఉన్నామన్నా ఫీలింగ్ రాకుండా పండగ వాతావరణంలో తమ కుటుంబంతో గడుపుతున్న అనుభూతి కలిగేలా ఈ సినిమా ఉంటుందట.
https://youtu.be/LSWZGgJ0K0Y