పలు రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా సమావేశం..

142
amith
- Advertisement -

యాస్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల సీఎంలతో సమావేశం నిర్వహించనున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఈ సమావేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు పాల్గొనబోతున్నారు. తుఫాన్ హెచ్చరికల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించబోతున్నారు.

తౌక్టే తుఫాన్ నుంచి ఇంకా బయటపడక ముందే యాస్ తుపాన్ ప్రభావం చూపడనుండటంతో ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రజలను అలెర్ట్ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీవ్ర తుపాన్‌గా మారి ఈనెల 26వ తేదీన ఒడిశా, బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీవ్రమైన తుఫాన్ గా మారుతుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయడంతో తీరప్రాంతంలో తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

- Advertisement -