POKపై అమిత్ షా..కీ కామెంట్స్

14
- Advertisement -

పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీ కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రచార సభలో భాగంగా పశ్చిమ బెంగాల్లోని హూగ్లీలో ప్రచార సభలో మాట్లాడిన అమిత్ షా… పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదని, దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.రాహుల్ బాబా, మమతా దీదీ ఎంత భయపడినా ఫర్వాలేదని అన్నారు. పీవోకే మనదని, ఆ ప్రాంతాన్ని మళ్లీ తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇంతకు ముందు జమ్మూకశ్మీర్ లో స్వతంత్రం కావాలంటూ నినాదాలు వినపడేవని, ఇప్పుడు పీవోకేలో వినపడుతున్నాయని చెప్పారు. మణిశంకర్ అయ్యర్, ఫరూఖ్ అబ్దుల్లా మాత్రం పాకిస్థాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని అంటున్నారని … పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి మాట్లాడకూడదని చెప్పి తమను భయపెట్టేవారని తెలిపారు.

జమ్మూకశ్మీర్‌లో ఇంతకు ముందు కొందరు నిరసనలు తెలిపేవారని అన్నారు. ఇప్పుడు ప్రధాని మోదీ ప్రభావంతో అక్కడ హర్తాళ్లు వంటివి జరగడం లేదని చెప్పారు.

Also Read:బడ్డీ.. ఫస్ట్ లిరికల్ రిలీజ్

- Advertisement -