మెగాస్టార్‌ ఇంటి వద్ద విద్యార్థుల ఆందోళన..!

530
amithab
- Advertisement -

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముంబై మెట్రో ప్రాజెక్టుకు మద్దతిస్తూ ట్వీట్ చేయడంపై విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. వివిధ పాఠశాలు, కాలేజీలకు చెందిన విద్యార్థులు సబర్బన్ జుహులోని అమితాబ్ బచ్చన్ నివాసం వద్దకు చేరుకున్నారు. దీంతో అమితాబ్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.

మెట్రో ప్రాజెక్టు కోసం ముంబైలోని అటవీ ప్రాంతంలో 2,700 చెట్లను నరికివేయాలని నిర్ణయించారు. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈనేపథ్యంలో బిగ్ బీ ఈ ట్వీట్ చేయడం ఆందోళనకు దారి తీసింది. ఇప్పటికే మెట్రో నిర్మాణం కోసం వేలాది చెట్లను నరికివేశారని.. పర్యావరణాన్ని కాపాడాలని విద్యార్థులు నినాదాలు చేశారు.

అబితాబ్ లాంటి సెలబ్రిటీ చెట్లు నరకడాన్ని ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, వారికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -