ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలి- ఎంపీ సంతోష్‌

600
- Advertisement -

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారుప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే ఈ గ్రీన్ ఛాలెంజ్‌ను తెలంగాణలోని ప్రముఖులంతా ఫాలో అవుతున్నారు.

TRS MP Santosh Kumar

తెలంగాణ మంత్రులు, టాలీవుడ్ నటులు, క్రీడాకారులు ప్రముఖంగా ఈ ఛాలెంజ్‌ను ఒకరికొకరు విసురుకుంటున్నారు. ఇప్పటికే కేటీఆర్, కవిత, నరసింహన్, హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు క్రిడాకారులు సచిన్, లక్ష్మణ్, సైనా నెహ్వాల్, గోపిచంద్ వంటి ప్రముఖులంతా ఈ ఛాలెంజ్‌లో పాల్గొని చెట్లను నాటారు.

5000 Trees planted

తాజాగా ఈ గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకె గ్రామంలో గ్రామస్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలను నాటారు. ఆ గ్రామస్తులు ఏకంగా 5000 చెట్లు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌ ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా అందరినీ కోరారు.. ఈ నేపథ్యంలో ఆయన గ్రామస్థులకు అభినందనలు తెలియజేసారు.

- Advertisement -