అమిత్ షాపై ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు

489
owaisi
- Advertisement -

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాపై తీవ్ర ఆరోపణలు చేశారు హైదరాబాద్ ఎంపీ,మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. హిట్లర్ తరహాలో అమిత్‌ షా కూడా చరిత్రలో నిలిచిపోతారని కామెంట్ చేశారు.

పౌర‌స‌త్వ బిల్లు ప్రాథ‌మిక హ‌క్కుల‌ను ఉల్లంఘిస్తోంద‌న్నారు. ఈ బిల్లును వ్య‌తిరేకించిన ఓవైసీ.. భార‌త్‌లో సెక్యుల‌రిజం మౌళిక‌మైంద‌న్నారు. బిల్లు వ‌ల్ల భార‌త్.. ఇజ్రాయిల్‌గా మారుతుంద‌ని అస‌దుద్దీన్ విమ‌ర్శించారు.

ఓవైసీ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్.

- Advertisement -