మోదీ, అమిత్‌ షా కృష్ణార్జునులు: రజనీకాంత్

311
Amith Sha Modi Rajinikanth
- Advertisement -

ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు సూపర్ స్టార్ రజనీకాంత్. చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన కశ్మీర్ సమస్యను పరిష్కరించడంలో బీజేపీ విజయం సాధించిందని చెప్పారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం భారత్‌కు, కశ్మీరీ ప్రజలకు శుభపరిణామం అన్నారు. మోదీ, అమిత్ షా కృష్ణార్జుల వంటి వారన్నారు.

మోదీ ఎదైనా చెబితే అమిత్ షా దాన్ని తప్పకుండా అనుసరిస్తారన్నారు. ఆర్టీకల్ 370ని రద్దు చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అమిత్ షా , మోదీ ఇద్దరు కలిసి కాశ్మిర్ ను భారత్ లో పూర్తిగా విలీనం చేయడంలో విజయవంతం అయ్యారని చెప్పారు. అమిత్ షా పార్లమెంట్ లో 370 బిల్లుపై అద్భుతంగా ప్రసంగించారన్నారు.

- Advertisement -