సంతన్న అన్నదానం కేంద్రంలో అంబేడ్కర్ జయంతి..

346
Annadanam
- Advertisement -

బోయినిపల్లి మండలం కోదురుపాక గ్రామంలో ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదానం క్యాంప్ 7వ రోజుకు చేరింది. మొదట రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేడ్కర్‌కు నివాళులు అర్పించి అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టారు. సుమారు 95 మంది వలస కార్మికులు భోజనాలు చేశారు. స్థానిక పోలీసులు కూడా భోజనాలు చేశారు. ఈ క్యాంప్ లాక్‌డౌన్‌ పూర్తి అయ్యేవరకు భోజనాలు పెడతామని జోగినిపల్లి రవీందర్ రావు తెలిపారు.

Annadanam in kodurupaka

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఉమకొండయ్య కత్తెరపాక, ఎంపీపీ వేణుగోపాల్, వైస్ ఎంపీపి నాగయ్య, గ్రామశాఖ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు చిక్కల సుధాకర్ రావు, కవ్వంపల్లి రాములు, ఉపేందుర్, అనిల్ కుమార్, ఐరెడ్డి మల్లరెడ్డి, ఒద్దెల మహేందర్, బొల్లావేని తిరుపతి, సందుల శ్రీనివాస్, ఆకుల కర్ణకర్, చింతలపల్లి తిరుపతి రెడ్డి, నాగుల నాగరాజు, సారంపెళ్లి రవి, కమల్, కళాధర్,గుండ్ల సాయబు పాల్గొన్నారు.

- Advertisement -