అంబటి వర్సెస్ బాలకృష్ణ..

36
- Advertisement -

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా మొదలయ్యాయి. చంద్రబాబు అరెస్టుపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబడుతూ స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. స్పీకర్ పైకి పేపర్లు విసరుతు చంద్రబాబుపై పెట్టిన కేసులు కొట్టేయాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో మంత్రి అంబటి రాంబాబు వర్సెస్ బాలకృష్ణగా మారిపోయింది.

అంబటి మాట్లాడుతున్న క్రమంలో రండి చూసుకుందాం అంటూ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేతితో సైగలు చేశారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. బాలకృష్ణ మీసాలు తిప్పుతూ రెచ్చగొడుతున్నారంటూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీసాలు సినిమాలో తిప్పు.. ఇక్కడ కాదు అంటూ సెటైర్ వేశారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సభలో తొడ కొట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొనగా టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.

చంద్రబాబు అరెస్ట్ పై సభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. టీడీపీ సభ్యుల నిరసనపై అసహనం వ్యక్తం చేశారు. కేవలం మీడియా దృష్టిని ఆకర్షించేందుకే టీడీపీ ఆందోళన చేస్తోందని మండిపడ్డారు.

Also Read:మహిళ బిల్లు..ఎందుకీ పెండింగూ?

- Advertisement -