పొలిటికల్ ఎంట్రీపై రాయుడు..

40
- Advertisement -

ఇటీవలె క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారు. దీనిపై స్పందించారు రాయుడు. గుంటూరులో కొద్దిరోజులుగా పర్యటిస్తున్న రాయుడు..ఇవాళ రాజకీయ ఆరంగేట్రంపై కామెంట్స్ చేశారు. తన తాతను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చానని వెల్లడించారు. త్వరలోనే పొలిటకల్ ఎంట్రీపై క్లారిటీ ఇస్తానని వెల్లడించారు.

Also Read:అల్లరి నరేష్ కీలక నిర్ణయం

ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంతో పాటు ఫిరంగిపురంలో పర్యటించారు రాయుడు.ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో విద్యార్థులతో ముచ్చటించారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఏపీలో క్రికెట్ క్రీడను ప్రోత్సహించేందుకు తన వంతు సహకారం అందిస్తానని, దీని గురించే ఇటీవల సీఎం జగన్ ను కలిసినట్టు చెప్పారు.

Also Read:AllariNaresh:#N62 అనౌన్స్ మెంట్

- Advertisement -