సర్వహక్కులు మీ సొంతం:హరీశ్‌రావు

37
- Advertisement -

నేడు గిరిజనులకు శుభదినమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇక నుంచి పోడు భూములపై గిరిజనులకు సర్వహక్కులు ఉంటాయని ఆయన అన్నారు. భ్రద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ…గిరిజన రైతుల భూములకు పట్టాలతో పాటు రైతుబంధు కూడా ఇస్తామని అన్నారు. మీ పేరుతో ధరణిలో భూమి రికార్డవుతుంది. ఇక ఈభూముల వైపు అటవీ అధికారులు కన్నెత్తి చూడరు. గతంలో పోడు భూముల వివాదాలకు సంబంధించి గిరిజనులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేస్తాం. ఈ భూములు వారసత్వంగా కూడా సంక్రమించే హక్కు కల్పిస్తాం. అంతేగా పోడు భూములు పొందిన రైతులకు ఉచిత విద్యుత్‌ అందిస్తాం. రైతులకు అందే ప్రతి స్కీమ్‌ పోడు భూములకు వర్తిస్తుంది. అకాల వర్షాలతో పంట నష్టపోతే పరిహారం అందుతుంది. మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లుగా కూడా గిరిజనులు అవకాశాలు పొందుతారు. గిరిజనులు బ్యాంకుల నుంచి పంట రుణాలు కూడా పొందవచ్చు అని మంత్రి హరీష్‌రావు చెప్పారు.

గిరిజనుల ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తున నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఇప్పటివరకు 22 మహిళా గిరిజన వెల్ఫేర్‌ కాలేజీలను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి గిరిజన తండాకు మిషన్‌ భగీరథ ద్వారా మంచినీరు అందిస్తున్నామని తెలిపారు. గిరిజన బిడ్డలకు నాణ్యమైన వైద్యం అందిచేందుకు మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

Also Read: HarishRao:పోడు పట్టాలను పంచిన మంత్రి..

భద్రాచలం, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, నియోజకవర్గాల్లో పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావుతో పాటు మరో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర్లు, హరిప్రియ నాయక్‌, మెచ్చా నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.

Also Read: TS BJP:ఈటల వర్సెస్ జితేందర్ రెడ్డి

- Advertisement -