ఆడియన్స్ కోసమే “బడ్డీ” టికెట్ రేట్లు తగ్గించాం!

7
- Advertisement -

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “బడ్డీ”. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్టు 2న “బడ్డీ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “బడ్డీ” ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నటుడు గోకుల్ మాట్లాడుతూ – “బడ్డీ” సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు శామ్ గారికి థ్యాంక్స్. టెడ్డీ బేర్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. టీమ్ అంతా నాకు బాగా సపోర్ట్ చేశారు. “బడ్డీ” సినిమాను థియేటర్స్ లో ఫ్యామిలీతో కలిసి చూడండి. అన్నారు.

దర్శకుడు శామ్ ఆంటోన్ మాట్లాడుతూ – “బడ్డీ” సినిమా ఆగస్టు 2న థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమా రిలీజ్ కు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. మేము చేసే మూవీస్ కు మీడియా సపోర్ట్ ఎంత అవసరమో నాకు తెలుసు. మీ సపోర్ట్ మాకు కావాలి. నేను చేసిన ప్రతి మూవీ నిర్మాతను సంతృప్తి పరిచింది. “బడ్డీ” విషయంలో కూడా మా ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉన్నారు. మా టీమ్ కూడా హ్యాపీగా ఉన్నారు. సినిమా సాధించబోయే సక్సెస్ తో పాటు నాకు ఇలా మా టీమ్ సంతోషంగా ఉండటమే కావాలి. “బడ్డీ”ని థియేటర్స్ లో చూస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ మాట్లాడుతూ – “బడ్డీ” సినిమా తక్కువ టికెట్ రేట్లతో మీ ముందుకు ఆగస్టు 2న వస్తోంది. మీరు మీ ఫ్యామిలీతో కలిసి తప్పక చూడండి. మీ ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకు నాకు చాలా స్పెషల్. మంచి క్యారెక్టర్ చేశాను. ఈ మూవీలో అవకాశం ఇచ్చిన నిర్మాత జ్ఞానవేల్ రాజా గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఎంతో లవ్, హార్డ్ వర్క్ తో “బడ్డీ” సినిమా చేశాం. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని చెప్పగలను. అన్నారు.

హీరోయిన్ ప్రిషా రాజేశ్ సింగ్ మాట్లాడుతూ – “బడ్డీ” రిలీజ్ కోసం మేమంతా వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. రిలీజ్ ఎప్పుడు అని నేను మా డైరెక్టర్ ను రెగ్యులర్ అడిగేదాన్ని. ఆయన త్వరలోనే అంటూ రిప్లై ఇచ్చేవారు. “బడ్డీ” మీ అందరికీ నచ్చుతుంది. ఈ మూవీలో నటించడాన్ని ఎంజాయ్ చేశాం. నాకు ఇది ఫస్ట్ మూవీ. మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నా. అన్నారు.

Also Read:సాగర్ స్వీయ దర్శకత్వంలో ‘కాలం రాసిన కథలు’

నటుడు అలీ మాట్లాడుతూ – లవ్, యాక్షన్, కామెడీ అన్నీ ఉన్న సినిమా “బడ్డీ”. ఈ చిత్రానికి తక్కువ టికెట్ రేట్స్ పెట్టారు. రిలీజ్ ముందు విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ లో వేసిన మూడూ షోస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మీ అందరికీ సినిమా నచ్చుతుంది. అల్లు శిరీష్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. మెగా ఫ్యామిలీలో దాదాపు అందరు హీరోలతో కలిసి నటించాను. శిరీష్ తాను ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చానని ఎప్పుడూ బిహేవ్ చేయడు. హీరోయిన్ గాయత్రికి తెలుగులో రెండో సినిమా. దర్శకుడు శామ్ గారు మన తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి మూవీ తీసుకొస్తున్నారు. బాగున్న సినిమాలను తెలుగు ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు. “బడ్డీ”కి కూడా మీ ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నా. అన్నారు.

- Advertisement -