నితిన్‌కు అల్లు అర్జున్ అభినందనలు..

383
nithiin
- Advertisement -

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక మందన హీరో,హీరోయిన్లుగా నటించిన తాజాగా చిత్రం భీష్మ. శివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ తారలు భీష్మ టీంకు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా స్టైలీస్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ స్పందించాడు.

“డబుల్ కంగ్రాచ్యులేషన్స్ నితిన్. ఇక నీ పెళ్లి వేడుకలు డబుల్ జోష్‌లో సాగుతాయి. మంచి టైమ్ వస్తే, అంతా మంచిగానే జరుగుతుంది. నీకు అంతా మంచే జరగాలి. ‘భీష్మ’ టీమ్ మొత్తాన్ని నేను అభినందిస్తున్నా” అని మెగా హీరో అల్లు అర్జున్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

ఆపై మరో ట్వీట్ పెట్టిన బన్నీ, “ఓ మంచి కమర్షియల్ ఎమోషనల్ ఎంటర్ టెయినర్ ను అందించినందుకు డైరెక్టర్ వెంకీకి కంగ్రాచ్యులేషన్స్. రష్మికకు, నా నిర్మాత వంశీకి శుభాకాంక్షలు. 2020 జనవరి, ఫిబ్రవరి మీకు గొప్పగా ఉంటుంది. మరోసారి అందరికీ కంగ్రాట్స్” అని ట్వీట్ పెట్టారు.

- Advertisement -