అడివిశేష్ మూవీపై అల్లు అర్జున్‌ ప్రశంసలు..

406
evaru
- Advertisement -

క్ష‌ణం, గూఢ‌చారి సినిమాలతో సూప‌ర్‌డూప‌ర్ హిట్స్‌ను సాధించిన అడివిశేష్ రీసెంట్‌గా ‘ఎవరు’ చిత్రంతో మరో హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం ఆగ‌స్ట్ 23న విడుద‌లై విజయవంతగా దూసుకుపోతుంది. ఇటు ప్రేక్ష‌కులు, అటు విమ‌ర్శ‌కు ప్ర‌శంస‌ల‌ను అందుకుంటుంది ఈ చిత్రం. రెజీనా క‌సండ్ర హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌ పోషించారు. చిత్రాన్ని డైరెక్టర్ కెప్టెన్ వెంక‌ట్ రామ్‌జీ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకటుకుంటుంది.

allu-arjun

ఈ నేపథ్యంలో ఈ మూవీపై విమ‌ర్శ‌కుల‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ ఎవ‌రు చిత్రాన్ని చూశారట. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో ట్విస్ట్‌లు ఎంతో థ్రిల్ ఇచ్చాయ‌ని ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నాడు.

టెక్నిక‌ల్ పాయింట్స్ బాగున్నాయి. శేషు ఎంచుకున్న ప్రాజెక్టులు ఆయ‌న‌కి మంచి స్టార్‌డంని అందిస్తున్నాయి. రెజీనా, న‌వీన్ చంద్ర‌, ముర‌ళీ శ‌ర్మ‌తో పాటు ప‌లువురు న‌టీన‌టులు చ‌క్క‌ని ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చారు. చివ‌రిగా కెప్టెన్ వెంక‌ట్ రామ్‌జీ షిప్‌ని అద్భుతంగా నడిపించారు అని బ‌న్నీ పోస్ట్‌ చేశారు.

- Advertisement -