అల్లు అర్జున్ తో పొలిటికల్ థ్రిల్లర్?

14
- Advertisement -

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న కొత్త సినిమాకి సంబంధించి ఓ కొత్త రూమర్ వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ సరసన నాయికగా జాన్వీ కపూర్ నటిస్తుండగా, సంజయ్ దత్, సీనియర్ నటి రేఖ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇది పొలిటికల్ యాక్షన్ డ్రామా అని తెలుస్తుంది. ప్రజా నాయకుడిగా సంజయ్ దత్ కనిపిస్తుండగా.. ఆయనకు అండగా నిలుస్తూ, ఆయన కోసం ఎంత దూరమైనా వెళ్ళే మిస్సైల్ లా అల్లు అర్జున్ కనిపిస్తున్నారు. మరి ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి ఈ పొలిటికల్ డ్రామాలో ఎలాంటి కమర్షియల్ అంశాలు పెట్టారు అనేది డౌటే. అల్లు అర్జున్ మేకోవర్, యాక్షన్ బాగానే ఉన్నా.. కంటెంట్ లో కూడా క్వాలిటీ ఉండాలి.

ఈ మధ్య త్రివిక్రమ్ పెన్నులో పదును తగ్గింది. పైగా ‘గుంటూరు కారం’ సినిమా కూడా పొలిటికల్ నేపథ్యంలోనే వచ్చి డిజాస్టర్ గా నిలిచింది. వీటన్నిటి మధ్య ఈ సినిమా అసలు వర్కౌట్ అవుతుందా ?, ఇప్పటికే, రెగ్యులర్ యాక్షన్ డ్రామాల పై జనం ఇంట్రెస్ట్ చూపించడం లేదు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తేనే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అవుతుంది. త్రివిక్రమ్ కి ఈ విషయంలోనే గతంలో మంచి పట్టు ఉండేది. కానీ, పెరుగుతున్న వయసు రీత్యా కావొచ్చు, లేక మాస్ పల్స్ కి దూరం అవ్వడం కావొచ్చు, మొత్తానికి త్రివిక్రమ్ లో గత తాలూకు పెన్ను పవర్ ఇప్పుడు అయితే లేదు.

దీనికితోడు అల్లు అర్జున్ సినిమాలకు క్లాస్ ఆడియన్స్ దూరంగా ఉంటారు. మరి ఈ కొత్త పొలిటికల్ థిల్లర్ తో అల్లు అర్జున్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాడో చూడాలి. ఇంతకీ, అల్లు అర్జున్ కి పొలిటికల్ థ్రిల్లర్ వర్కౌట్ అవుతుందా ? అనేది కూడా క్వశ్చనే. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక హసని బ్యానర్‌ పై నిర్మాత నాగవంశీ భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గుంటూరు కారం ప్లాప్ తర్వాత త్రివిక్రమ్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Also Read:Roja:రోజాకు నో టికెట్?

- Advertisement -