నాగ్ సినిమాలో మరో యంగ్ హీరో?

36
- Advertisement -

రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగ్ ఓ విలేజ్ ఎంటర్టైనర్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ సినిమా వచ్చే నెల నుండి షూటింగ్ మొదలు కానుంది. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘పొరింజు మరియమ్ జోస్’ అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కొన్ని మార్పులు తీయబోతున్నాడు ప్రసన్న.

అయితే ఈ సినిమాలో అల్లరి నరేష్ ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయనున్నాడు. తాజాగా ప్రసన్న నరేష్ కి స్క్రిప్ట్ , కేరెక్టర్ చెప్పేసి లాక్ చేసుకున్నాడు. ఇందులో మరో హీరో కూడా ఉండబోతున్నాడని తెలుస్తుంది. కథలో ఓ ముఖ్యమైన పాత్రలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కనిపించనున్నాడని సమాచారం. రాజ్ తరుణ్ సినిమా చూపిస్తా మావ తోనే ప్రసన్న రచయితగా ఎంట్రీ ఇచ్చాడు. అందుకే ఆ రిలేషన్ షిప్ కోసం రాజ్ తరుణ్ కి కూడా ఇందులో ఇంపార్టెంట్ రోల్ ఇస్తున్నాడని తెలుస్తుంది. ఇక రాజ్ తరుణ్ మొదటి సినిమా ఉయ్యాల జంపాల కి నాగార్జున నిర్మాత. తనకి మొదటి అవకాశం ఇచ్చిన నాగ్ తో రాజ్ తరుణ్ నటించనున్నాడన్న మాట.

శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్న ఈ సినిమా అమలాపురం పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుపుకోనుంది. త్వరలోనే సినిమా ఎనౌన్స్ మెంట్ తో పాటు మరిన్ని అప్ డేట్స్ వదిలే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -