అల్లా దయతో ప్రత్యేక తెలంగాణ:కేసీఆర్

301
kcr iftar
- Advertisement -

అల్లా దయతో ప్రత్యేక తెలంగాణ సిద్దించిందని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున దావత్‌-ఎ-ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశారు. తెలంగాణ అభివృద్ధిలో మొదటి స్ధానంలో ఉందని తెలిపారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని ముస్లింల అభివృద్ధికి ఎన్నో చర్యలు చేపట్టామని వెల్లడించారు. ముస్లం సంక్షేమానికి రూ. 2 వేల కోట్లను కేటాయించామన్నారు.

kcr

సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. ఈ ఇఫ్తార్ విందులో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మండలి చైర్మన్ స్వామి గౌడ్, మంత్రులు నాయిని, హరీశ్ రావు, తలసాని, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పాల్గొన్నారు.

- Advertisement -