సినీ రంగంలోకి షర్మిల కొడుకు!

33
- Advertisement -

సినీ రంగంలో వారసుల ఎంట్రీ కొత్తేమీ కాదు. ఫ్యామిలీ నుండి ఒక్కరు ఇండస్ట్రీలో ఉంటే చాలు అంతా అక్కడ వాలిపోతారు. అలా వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయిన వాళ్లు కొంతమంది అయితే మరికొంతమంది ఇంకా సక్సెస్ కోసం ఎదురుచూస్తునే ఉన్నారు.

అయితే తాజాగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కొడుకు రాజారెడ్డి వెండితెర ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఇటీవలె వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు తన తల్లితో పాటు ఇడుపులపాయకు వచ్చిన రాజారెడ్డి అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో రాజారెడ్డి త్వరలోనే టాలీవుడ్ కు పరిచయమవుతారని టాక్ కూడా వినిపించింది.

తాజాగా ఆవార్తలకు నిజం చేకూరేలా మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. రాజారెడ్డిని హీరోగా చేసేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని… పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారని టాక్ నడుస్తోంది. యాక్షన్ ఓరియెంటెడ్ కథతో రానున్నారట. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.

Also Read:ఈ అద్బుతమైన ఆరోగ్య చిట్కాలు..తెలుసా?

- Advertisement -