షారుఖ్ కే షాకిచ్చిందిగా..!

215
- Advertisement -

షారుఖ్‌ ఖాన్‌ వస్తున్నాడంటే చాలు.. అక్కడ ఫ్యాన్స్‌ తాకిడి మామూలుగా ఉండదు. అందులో బాలీవుడ్‌ స్టార్స్‌ అంతా వస్తున్నారంటే..? ఇక ఫ్యాన్స్‌ కి పండగే. తాజాగా షారుఖ్‌ భార్య గౌరీ ఖాన్‌ ఇటీవల ఓ రెస్టారెంట్‌ నిర్వహణకు సిద్ధమైంది.

ముంబాయిలోని ఆ రెస్టారెంట్‌ ప్రారంభోత్సవం ఇటీవలే జరిగింది. దీనికి బాలీవుడ్‌ ప్రముఖులు అనిల్‌ కపూర్‌, అర్జున్‌ కపూర్‌, సోనమ్‌ కపూర్‌, కరణ్‌ జోహార్‌, సిద్ధార్థ మల్హోత్ర, అలియా భట్‌ తదితరులంతా హాజరయ్యారు.

All eyes on Suhana Khan as she steps out like a diva with daddy Shah Rukh Khan...

ఇక్కడ విశేషం ఏమిటంటే షారుఖ్‌ ఖాన్‌తో కలసి తన తనయ సుహన కూడా హాజరైంది. ఇక ఈ కార్యక్రమానికి సుహానే హైలెట్‌ గా నిలిచింది. దాంతో అంతే.. అక్కడున్న మీడియా అంతా సుహానా ఖాన్ పైనే ఫోకస్ చేసింది. కారణమేంటంటే..సుహానా ఆరెంజ్‌ కలర్‌లో ఉన్న డ్రెస్‌లో కనిపించి అక్కడున్నవారిని అవాక్కైయ్యేలా చేసింది.

ఇక ఈ కార్యక్రమానికి షారుఖ్‌ తనయుడు ఆర్యన్‌ మాత్రం రాలేదు. వీరంతా వస్తున్నారని ముందే ప్రచారం కావడంతో అభిమానులు ఎక్కువగా వచ్చారు. వీరి తాకిడికి వెంటవెంటనే కార్యక్రమం ముగించుకోవాల్సి వచ్చింది. షారుఖ్‌ తన కుమార్తెను బాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సుహన ఇలా ఎంట్రీ ఇవ్వడంతో ప్రత్యేకత సంతరించుకుంది. దీని బట్టి త్వరలోనే ఎంట్రీ ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి షారుక్‌ హైలెట్‌ గా నిలుస్తాడనుకుంటే.. ఆయనే కూతురు హైలెట్‌గా నిలిచి షారుక్‌ కి షాక్‌ ఇచ్చిందనే చెప్పాలి.

- Advertisement -