Telangana:దశాబ్ది ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

40
- Advertisement -

సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపును ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముగింపు రోజున ర్యాలీలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ట్యాంక్‌బండ్‌పై 750డ్రోన్‌లతో భారీ డ్రోన్‌ షో నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

మంగళవారం అంబేద్కర్ విగ్రహం వద్ద హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, డీజీపీ(DGP) అంజనీ కుమార్, ఆర్ అండ్ బీ కార్యదర్శి శ్రీనివాసరాజు, కలెక్టర్ అమయ్ కుమార్, సమాచార శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ, పలువురు డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై అధికారులకు మంత్రులు పలు సూచనలు చేశారు.

Also Read: ఇకపై ప్రభుత్వ రైస్ మిల్లులు..

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…నగరంలోని అన్ని నియోజకవర్గాల నుంచి అంబేద్కర్‌ విగ్రహం వద్దకు బైక్‌ ర్యాలీ ఉంటుందని వెల్లడించారు. అనంతరం వేలాది మంది కళాకారులు నృత్యాలు డప్పు చప్పుళ్లు వివిద వేషధారణలతో అమరవీరుల స్మారక కేంద్రం వరకు ఈ ర్యాలీ చేరుకుంటుందని అన్నారు. అనంతరం స్మారక కేంద్రాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన తర్వాత సభలో ప్రసంగిస్తారని అన్నారు. గడిచిన 9యేళ్లలో సాధించిన తెలంగాణ ప్రగతిని విజయాలను అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించే విధంగా డ్రోన్ షో ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ రాకపోకలు నిలిపివేయనున్నట్టు తెలిపారు.

Also Read: సొంతగూటికి కోమటిరెడ్డి.. ?

- Advertisement -