కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన చైతూ..

233
Naga_Chaitanya
- Advertisement -
అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం రెండు సినిమాల్లో బిజీగా ఉన్నాడు. దర్శకుడు మారుతి దర్శకత్వంలో శైలజారెడ్డి అల్లుడు సినిమా …చందూ మొండేటి దర్శకత్వంలో సవ్వశాచి అనే సినిమాను చేస్తున్నాడు. రెండు సినిమాలు ఒకే సారి ఒప్పుకోవడంతో షూటింగ్ కు చాలా ఇబ్బంది కలిగిందట. అందుకే సవ్వసాచి సినిమా విడుదలకు కొంచెం ఆలస్యం కానుందని సమాచారం. మారుతి దర్శకత్వంలో చేస్తున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో హీరోయిన్ గా అనూ ఇమాన్యూఎల్ నటించగా రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుంది. ఇటివలే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు.
shalija reddy alludu
ఈఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. రెండు సినిమాల షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఒకే నెలలో రెండు సినిమాలు విడుదల కానున్నాయి. ఇక తన తర్వాతి సినిమాలు ఒకదాని తర్వాత మరోకటి చేయాలని నిర్ణయించుకున్నాడట చైతూ. తాజాగా వస్తున్న సమాచారం ఏంటంటే..చైతన్య తన తర్వాతి  సినిమా ఓ కొత్త దర్శకుడితో చేయనున్నాని తెలుస్తుంది.
naga chaitanya
అన్నపూర్ణ ఫిలీం స్టూడియోలో శిక్షణ తీసుకున్న ఓ యువకుడు ఈసినిమాకు దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. అతను చెప్పిన లైన్ నచ్చడంతో నాగర్జున, నాగచైతన్య ఇద్దరూ కథను ఒకే చేసినట్టు సమాచారం. సినిమాకు సంబంధించిన స్క్రీప్ట్ వర్క్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు యంగ్ డైరెక్టర్ . అక్టోబర్ లో ఈసినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారని సమాచారం. ఇక చైతూ నటించిన శైలజారెడ్డి అల్లుడు సినిమా ఆగస్టు 15న విడుదల కానుండగా..ఆగస్టు 31న సవ్వసాచి సినిమాను విడుదల చేయనున్నారు.
- Advertisement -