బీజేపీని గద్దె దించడమే లక్ష్యం:అఖిలేష్

55
- Advertisement -

బీజేపీని గద్దె దించడమే విపక్షాల లక్ష్యం అన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో అఖిలేష్ యాద‌వ్ భేటీ అయ్యారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు చేరుకున్న అఖిలేష్ యాద‌వ్‌కు సీఎం కేసీఆర్ సాద‌రంగా స్వాగ‌తం ప‌లికారు.

ఇక అంతకముందు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అఖిలేష్‌కు మంత్రులు తలసాని,ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అఖిలేష్…కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీని గ‌ద్దె దింపాలంటే విప‌క్షాల‌న్నీ ఏకం కావాల‌న్నారు.

Also Read:సినీ లోకంలో రెండు విషాదాలు

బీజేపీ వ్య‌తిరేకుల‌ను క‌లుపుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని…. విప‌క్షాల పోరాటంపై కేసీఆర్‌తో చ‌ర్చించేందుకు వ‌చ్చాన‌ని తెలిపారు. అంద‌రి ల‌క్ష్యం కూడా బీజేపీని అధికారం నుంచి దించ‌డ‌మే అని స్ప‌ష్టం చేశారు.

Also Read:PK1: ట్రెండింగ్‌లో ‘పెద్దకాపు-1’

- Advertisement -