ముగిసిన సీఎం కేసీఆర్‌- అఖిలేష్‌ యాదవ్‌ల భేటీ

73
Akhilesh Yadav
- Advertisement -

ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో శనివారం సమావేశమయ్యారు. ఢిల్లీ లోని సీఎం కేసిఆర్ అధికారిక నివాసంలో వారి భేటీ జరిగింది. ఈ సందర్భంగా పలు జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. సుదీర్ఘంగా కొసాగిన ఈ సమావేశం ముగిసింది.

ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న అఖిలేష్‌కు సీఎం కేసీఆర్‌ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీలు సంతోష్‌ కుమార్‌, నామా నాగేశ్వర రావు, రంజిత్‌ రెడ్డి, వెంకటేష్‌ నేత పాల్గొన్నారు. కాగా, ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో సీఎం కేసీఆర్‌ సమావేశమవుతారు. అనంతరం కేజ్రీవాల్‌తో కలిసి రాజధానిలోని పలు ప్రదేశాలను సందర్శించనున్నారు. మొహల్లా క్లినిక్‌, దక్షిణ మోతీబాద్‌ సర్వోదయ పాఠశాలను సందర్శిస్తారు.

- Advertisement -