లఖీంపూర్ ఫైల్స్‌ని తెరకెక్కించాలి: అఖిలేష్

107
akhilesh
- Advertisement -

క‌శ్మీర్ పండిట్లపై క‌శ్మీర్ ఫైల్స్ సినిమా తీశారు….మరి లఖింపూర్ ఘటనపై ల‌ఖింపూర్ ఫైల్స్‌ను కూడా తెర‌కెక్కించాల‌న్నారు స‌మాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) అధ్య‌క్షుడు అఖిలేష్ యాద‌వ్. సీతాపూర్‌లో మీడియాతో మాట్లాడిన అఖిలేష్…. రైతుల‌పై జీపు దూసుకెళ్లిన ఘ‌ట‌న జ‌రిగిన ల‌ఖింపూర్ ఫైల్స్‌పై సినిమా ఎందుకు రాకూడ‌ద‌ని ప్ర‌శ్నించారు.

కశ్మీర్ పండిట్ల బాధను ఆక్రోశంగా మార్చేలా….పాత గాయాన్ని మాన్చేందుకు ప్ర‌య‌త్నించి ఇరు వ‌ర్గాల మ‌ధ్య సామ‌ర‌స్య వాతావ‌ర‌ణం నెల‌కొనేలా చూడాల్సిన కేంద్ర ప్ర‌భుత్వం ఇరు వ‌ర్గాల మ‌ధ్య విభ‌జ‌న పెరిగేలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని మండిప‌డ్డారు.

ఓట‌ర్ల మ‌ద్ద‌తుతో తాము నైతిక విజ‌యం సాధించామ‌ని, రాబోయే రోజుల్లో బీజేపీ సీట్లు మ‌రిన్ని త‌గ్గుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీకి సీట్లు, ఓట్లు పెరిగాయ‌ని తెలిపారు. రాష్ట్రంలో పాల‌క పార్టీ ధ‌ర‌ల మంట‌, యువ‌త‌కు ఉపాధి వంటి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల్సి ఉంద‌న్నారు.

- Advertisement -