చిరు షోలో అఖిల్‌ గెస్ట్‌గా…

199
- Advertisement -

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి బుల్లితెరలో కూడా అరంగేట్రం చేసేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 13న మెగాస్టార్ హోస్ట్ గా మీలో ఎవరు కోటీశ్వరుడు తొలి ఎపిసోడ్ ప్రసారం అయింది. కోట్లాదిమంది మెచ్చే వెండితెర మెగాస్టార్.. ఇప్పుడు బుల్లితెరపై తను ఆడుతూ.. కంటెస్టెంట్లతో ఆడిస్తుంటే.. చూసేందుకు ప్రేక్షకులకు రెండు కళ్లు సరిపోవడ లేదు. మీలో ఎవరు కోటీశ్వరుడు ఇప్పుడుప్పుడే హిట్ ట్రాక్ లోకి వస్తోంది. షో కి వస్తున్న సెలబ్రిటీ గెస్ట్ లు కూడా అందుకు కారణమే. ఈ షోని మొదట నాగార్జున హోస్ట్ గా చేశారు. ఇప్పుడు ఆయన బిజినెస్ ఫ్రెండ్ చిరంజీవి చేస్తున్నారు. ఇంకా బ్రాడ్ కాస్ట్ కానీ ఒక ఎపిసోడ్ కి అక్కినేని చిన్న హీరో అఖిల్ గెస్ట్ గా వెళ్ళాడు.

Akhil will be Guest for 'Meelo Evaru Koteeswarudu

చిరంజీవి అంతటి వారిని చూస్తే ఎవ్వరికైనే ఫ్యాన్ మోమెంట్ రాక తప్పదు. చిన్నప్పటి నుండి ఆయన్ను చూస్తూ పెరిగిన కూడా అఖిల్ మీలో ఎవరు కోటీశ్వరుడు సెట్లో ఒక ఫ్యాన్ లా సంబరాలు చేసుకున్నాడు. ఆ ముచ్చటే ఇక్కడ ఉన్న సెల్ఫిలో చెప్పాడు. “నేను మాటలో చెప్పలేను ఆ క్షణం ఎలా ఫీల్ అయ్యానో. మెగాస్టార్ చూపిన ప్రేమ నన్ను మరింత ఆయనను ప్రేమించేలా చేసింది” అనీ తన ట్విటర్ లో చిరంజీవి తో తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేస్తూ చెప్పాడు అఖిల్. ఇకపోతే అమల అక్కినేని నిర్వహిస్తున్న బ్ల్యూ క్రాస్ కి డొనేషన్ చేసిన్నందుకు థాంక్స్ కూడా చెప్పుకున్నాడు. అంటే ఇక్కడ గెలిచిన ప్రైజ్ మనీ అక్కడకు ఇచ్చేశాడనమాట.

అక్కినేని త్రయం ఇప్పుడు బాగా బిజీ గా ఉన్నారు అఖిల్ అన్న నాగ చైతన్య కొత్త సినిమా రా రాండోయి వేడుక చూద్దాం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అఖిల్ కూడా తన రెండో సినిమా కోసం పూర్తిగా ఫోకస్ లో ఉన్నాడు. అలాగే నాగ్ కూడా రాజు గారి గది రిలీజ్ కోసం వెయిటింగ్. ఇకపోతే వీరందరూ అప్పుడప్పుడూ ఇలా మీలో ఎవరు కోటీశ్వరుడులో తళుక్కుమంటున్నారు. రారండోయ్ కోసం చైతూ కూడా వెళ్తాడటలే.

- Advertisement -