నాగ్‌తో అఖిల్…ఫ్యాన్స్‌కు పండగే!

57
nag
- Advertisement -

తెలుగు చిత్రపరిశ్రమలో మల్టీస్టారర్‌లు కొత్తకాదు. ఇప్పటికే పలువురు స్టార్లు కలిసి నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అలరించగా ఇక ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీ కలిసి నటించిన సినిమాలు భారీ వసూళ్లను రాబట్టాయి. మనం, బంగార్రాజు చిత్రాలు సక్సెస్ సాధించగా తాజాగా నాగ్- అఖిల్ కాంబోలో సినిమా తెరకెక్కనుంది.

తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో ఓ వినూత్నమైన కథ వీరిద్దరూ ముందుకురానున్నారు. కథ నచ్చడంతో నాగ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అన్నపూర్ణా స్డూడియోస్ లోనే నిర్మించబోతున్నారు.

గతంలో తండ్రి నాగార్జునతో కలిసి సిసింద్రీ సినిమా చేశారు అఖిల్. తర్వాత మనం సినిమాలో మెప్పించారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ఒకవేళ అధికారిక ప్రకటన వస్తే ఫ్యాన్స్‌కు పండగే.

- Advertisement -