‘ధృవ నక్షత్తిరమ్’లో తెలుగమ్మాయి..

254
- Advertisement -

విక్రమ్ – గౌతమ్ మీనన్ కంబినేషన్‌లో ‘ధ్రువ నక్షత్తిరమ్’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి కథానాయకిగా ‘పెళ్లి చూపులు’ భామ రితూ వర్మ ఒక కథానాయికగా ఎంపిక చేయగా మరో తెలుగమ్మాయిని హీరోయిన్‌గా ఎంపిక చేశారు.ఆ కథానాయికగా ఐశ్వర్య రాజేష్‌ను తీసుకున్నారట.

Aishwarya Rajesh in Dhruva Natchathiram

విక్రమ్‌ తన ప్రతీ సినిమాలో కోత్తగా వెరైటీగా కనిపిస్తుంటాడు.మరి స్టైలిష్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ నటిస్తున్న చిత్రం ‘ధృవ నక్షత్తిరమ్’. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో స్పై ఏజెంట్‌గా డిఫరెంట్ రోల్‌లో కనిపించబోతున్నాడు విక్రమ్. ఇందులో మొదట హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయెల్‌ని అనుకున్నారు. అయితే ఆమె డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ‘పెళ్లి చూపులు’ భామ రితూ వర్మని ఎంపిక చేశారు. ఇప్పుడు మరో కథానాయికగా కూడా తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్‌ను ఎంపిక చేశారట.

మరి ఈ ఐశ్వర్య రాజేష్ ఒకప్పటి తెలుగు నటుడు రాజేష్ కుమార్తె. అలాగే కమెడియన్ శ్రీలక్ష్మికి ఈమె మేనకోడలు. చెన్నైలోనే ఉండే ఐశ్వర్య ఇప్పటివరకూ తెలుగు సినిమాల్లో నటించకపోయినా.. తమిళంలో మాత్రం 20 సినిమాల వరకూ నటించింది. ప్రస్తుతం ఐశ్వర్య చేతిలో అరడజను తమిళ చిత్రాలున్నాయి. తాజాగా బడా మూవీ విక్రమ్-గౌతమ్ మీనన్ ‘ధృవ నక్షత్తిరమ్’లో కూడా ఛాన్స్ కొట్టేసింది. మరి విక్రమ్ సినిమాతోనైనా ఈ తెలుగమ్మాయికి బిగ్ బ్రేక్ వస్తుందేమో చూడాలి.

- Advertisement -