సరిలేరు నీకెవ్వరు తర్వాత లాంగ్ బ్రేక్..!

589
mahesh babu
- Advertisement -

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది. 13 ఏళ్ల గ్యాప్‌ తర్వాత సీనియర్ నటి విజయశాంతి ఈ మూవీలో కీ రోల్ పోషిస్తోంది.

ఇక ఈ మూవీ తర్వాత మహేష్ చేసే నెక్ట్స్ ప్రాజెక్టు ఏంటా అనే ఆసక్తి అందరిలో నెలకొనగా ఉహించని ట్విస్ట్ ఇచ్చారు సూపర్ స్టార్. సరిలేరు నీకెవ్వరు తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట మహేష్‌.

అయితే సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ …వంశీపైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తారనే వార్తలు వచ్చాయి. దీంతో పాటు తిరిగి అనిల్ రావిపూడి దర్శకత్వంలోనే మరో సినిమా చేస్తారనే వార్తలు వచ్చినా వాటన్నింటికి పుల్ స్టాప్ పెట్టినట్లు తెలుస్తోంది.

- Advertisement -