బెల్ఫాస్ట్లో జరిగిన మూడో వన్డేలో ఐర్లాండ్పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆఫ్ఘనిస్థాన్ 2027 వన్డే ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధించింది. 207 పరుగుల లక్ష్య ఛేదనలో రషీద్ ఖాన్ 37 పరుగులతో నాటౌట్గా నిలిచి ఆఫ్ఘనిస్థాన్ను విజ్రీతీరాలకు చేర్చాడు.
ఈ విజయంతో దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న తదుపరి ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధించే 10 జట్లలో ఆఫ్ఘనిస్థాన్ ఒకటైంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల్లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 14 జట్లు పాల్గొననుండగా, మిగిలిన 4 జట్లు క్వాలిఫైయర్ ద్వారా ఎంపికవుతాయి. మరోవైపు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని ఐర్లాండ్ ఇప్పటికే కోల్పోవడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే 10 జట్ల క్వాలిఫైయర్ టోర్నీలో ఆడాల్సి ఉంటుంది.
బెల్ఫాస్ట్లో సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రషీద్ ఖాన్ 37 పరుగులతో నాటౌట్గా నిలిచి ఆఫ్ఘనిస్థాన్ను 3 వికెట్ల తేడాతో గెలిపించాడు. ఓపెనర్ రహమానుల్లా గుర్బాజ్ (71) క్రీజులో ఉన్నంతసేపు కూడా సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయిన ఆఫ్ఘన్ జట్టు, ఆయన అవుట్ అయ్యాక మరింత కష్టాల్లో పడింది. అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్ కలిసి 7వ వికెట్కు 22 పరుగులు జోడించినప్పటికీ, మార్క్ అడైర్ ఒమర్జాయ్ను అవుట్ చేశాడు. దీంతో మ్యాచ్ను ముగించే బాధ్యత రషీద్ ఖాన్ భుజాలపై పడింది. 9వ నంబర్ బ్యాటర్ యామిన్ అహ్మద్జాయ్కు స్ట్రైక్ ఇస్తూనే రషీద్ ఎక్కువ పరుగులు సాధించాడు.
Also Read:రూ.271 కోట్లకు పెంట్హౌస్..రికార్డు డీల్!
కేవలం వికెట్లు కోల్పోవడం వల్ల మాత్రమే మ్యాచ్ చేజారే అవకాశం ఉండటంతో అహ్మద్జాయ్ వికెట్ కాపాడుకుంటూ 24 బంతుల్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. రషీద్ కూడా సింగిల్స్కే ప్రాధాన్యం ఇచ్చాడు. ఐదు ఓవర్లకు పైగా ఒక్క బౌండరీ కూడా రానప్పటికీ చివరికి రషీద్ నాలుగు ఓవర్లలో మూడు ఫోర్లు బాది జట్టును గెలిపించడమే కాకుండా 2027 ప్రపంచకప్లోకి తీసుకెళ్లాడు.

