భవిష్యత్తులో ఢిల్లీ ప్రజల దీన స్థితి…

62
- Advertisement -

భారతదేశం ఒక ఖండంకు ఉండాల్సిన విభిన్న లక్షణాలు కలబోత. అయితే భారతదేశంలో విభిన్న పక్షిజాతులు జంతువులు అడవులు ఉన్న…రోజురోజు పెరుగుతున్న వాహనాల రాకపోకలకు ప్రజలు నిత్యం కాలుష్యానికి గురువుతున్నారు. ఈనేపధ్యంలో ప్రతియేటా ఖరీఫ్‌ కాలం ముగిసిన తర్వాత ఢిల్లీ దాని పరిసర రాష్ట్రాల్లో గడ్డిని తగులబెట్టడంతో ఢిల్లీ వాసులు కాలుష్యానికి గురవుతున్నారు. అంతేగాక ఢిల్లీలో పెరిగిన వాహనాల రద్ధీ వల్ల కూడా కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. దీంట్లో ముఖ్యంగా ఢిల్లీ ప్రజలు వాయు కాలుష్యంకు బారిన పడుతున్నారు. కానీ కాలుష్య నివారణకు ఢిల్లీ ప్రభుత్వం ఎన్ని నిర్ణయాలు తీసుకంటున్నటప్పటికీ పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. అయితే గత కొంత కాలంగా కరోనా కారణంగా కాలుష్యం తగ్గిన మళ్లీ పూర్వ స్థితికే చేరుకుంది.

మాధవ్‌ కోహ్లీ అనే ట్విట్టర్ యూజర్‌ ద్వారా భవిష్యత్‌ ఢిల్లీ ప్రజలను కృత్రిమ మేధ (ఏఐ) ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు కాస్త భవిష్యత్‌ ఢిల్లీపై అందరూ ఆలోచిస్తున్నారు. దానికి కారణం ఇందుకు సంబంధించిన ఫోటోలు భయంకరంగా ఉన్నాయి. ఇప్పటికే లక్షలాది మంది కాలుష్య బారిన పడి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో ఢిల్లీ ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కళ్లలో మంటతో బాధపడే ప్రమాదం, వీధులంతా పొగమయం అయ్యే ముప్పుతో పోరాడుతున్నారో ఈ ఫోటోల్లో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి…

భూతల్లికి రైతు తెలిపే కృతజ్ఞత సంక్రాంతి..

జోడో యాత్రలో విషాదం…

బీజేపీకి బలం తగ్గిపోతుంది…

- Advertisement -