ప‌వ‌న్ కోసం మేజ‌ర్ ప‌క్కా! :అడ‌వి శేష్

74
major
- Advertisement -

అడ‌విశేష్ హీరోగా తెర‌కెక్కిన పాన్ ఇండియా చిత్రం మేజ‌ర్. 26/11 ముంబై ఉగ్ర దాడిలో ప్రాణాలు విడిచిన మేజ‌ర్ సందీప్ ఉన్ని క్రిష్ణ‌న్ జీవిత క‌థ‌ ఆధారంగా తెర‌కెక్క‌గా జూన్ 3న ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల కానుంది.

శ‌‌శి కిరణ్ టిక్కా (Sashi Kiran Tikka) డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ సినిమాను ప్ర‌మోట్ చేయ‌డంలో భాగంగా స్పెష‌ల్ స్క్రీనింగ్ షోతో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు మేక‌ర్స్. ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం మేజ‌ర్ స్పెష‌ల్ స్క్రీనింగ్ వేస్తారా..? అని ట్విట‌ర్‌లో నెటిజ‌న్లు ప్ర‌శ్న‌లు అడ‌గ‌గా ప‌వ‌న్ అభిమానుల కోరిక మేరకు ఆయ‌నకు స్పెష‌ల్ ప్రీమియ‌ర్ ప‌క్కా అని తెలిపారు అడ‌వి శేష్. .

సోనీ పిక్చ‌ర్స్ ఇండియా, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఏ+ఎస్ మూవీస్ సంయుక్తంగా మేజ‌ర్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

- Advertisement -