‘గూఢ‌చారి’ మ‌ళ్లీ వ‌స్తున్నాడు..

136
Adivi Sesh
- Advertisement -

దేశ‌భ‌క్తితో నిండిన పాన్ ఇండియా మూవీ మేజ‌ర్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో అడివి శేష్‌. ఈ సినిమా మేజ‌ర్ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌వ‌గానే అడివి శేష్ త‌న కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన చిత్రం గూఢ‌చారి సినిమా సీక్వెల్‌ను చేయ‌బోతున్నారు. గూఢ‌చారి సినిమా విడుద‌లై మంగ‌ళ‌వారం(ఆగ‌స్ట్‌3) నాటికి మూడేళ్లు పూర్త‌య్యాయి. ఈ నెల‌లోనే గూఢ‌చారి సీక్వెల్‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ను చేయ‌బోతున్నారు.

గూఢ‌చారి మ‌ళ్లీ వ‌స్తున్నాడు.. ఈ నెల‌లోనే ప్ర‌క‌ట‌న ఉంటుంది అంటూ మేక‌ర్స్ తెలిపారు. ఈ రోజుతో గూఢ‌చారి మూడేళ్లు పూర్తి చేసుకుంది. నాకు చాలా ఇష్ట‌మైన సినిమా. ముఖ్యంగా ఈ సినిమాను పిల్ల‌లు చాలా ఇష్ట‌ప‌డి చూశారు. ఆగ‌స్ట్ నెల నాకు బాగా క‌లిసొస్తుంది. ఈ నెల‌లోనే నా నెక్స్‌ట్ సినిమా G2(గూఢ‌చారి2) కు సంబంధించిన అతి పెద్ద అప్‌డేట్‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాను అంటూ అడివిశేష్ ట్వీట్ చేశారు. గూఢ‌చారి చిత్రాన్ని శ‌శికిర‌ణ్ తిక్క డైరెక్ట్ చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన వివరాలు తెలియజేస్తారు.

- Advertisement -