సారీ చెప్పిన అడవి శేష్

98
adivi sesh
- Advertisement -

సుధీర్ వర్మ దర్శకత్వంలో నివేదా థామస్, రెజీనా కసాండ్రా ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం శాకిని డాకిని. దక్షిణ కొరియా యాక్షన్ కామెడీ చిత్రం మిడ్‌నైట్ రన్నర్స్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుండగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది.

ఈ ఈవెంట్ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు అడవి శేష్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…ఈ సినిమా నిర్మాత సునీత కి సారీ చెప్పడం కోసమే ఈ ఈవెంట్‌కి వచ్చాను అని తెలిపారు. మేజర్‌ సినిమాలో హీరోయిన్ తల్లి పాత్ర కోసం ఒక ఆర్టిస్ట్ ని తీసుకున్నాం. అయితే ఆమెకి కోవిడ్ రావడంతో సినిమా నుంచి తప్పుకుందని చెప్పారు.

ఆ సమయంలో మాకు సునీత గారే గుర్తుకు వచ్చి ఆమెని సంప్రదించాం. సునీత గారు మేజర్ సినిమాలో నటించారు. కానీ సినిమా నిడివి ఎక్కువవడంతో ఆమె ఉన్న సన్నివేశాలు తొలగించాల్సి వచ్చింది. అప్పుడు కలిసి సారీ చెబితే కొడతారేమోనన్న భయంతో ఇక్కడ ఈవెంట్లో చెప్తున్నా అని తెలిపారు.

- Advertisement -