గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న నటి సింధురా..

216
Actress Sindhura
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సినీ నటి సింధురా ధర్మాసనం మొక్కలు నాటారు. సినీ నటి మహేశ్వరి విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మూడు మొక్కలు నాటిన సినీ నటి సింధురా ధర్మాసనం తెలిపారు.

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మూడు మొక్కలు నాటానని సింగర్ హరిణి తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మరో ముగ్గురు ( సీరియల్ ఆర్టిస్ట్ లు అనుశ్రీ , అనిక , లావణ్య )లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని కోరారు.

- Advertisement -