సమంత పోస్ట్ మళ్లీ వైరల్

29
- Advertisement -

నాగ చైతన్య, సమంత ప్రస్తుతం ఎవరి లైఫ్ లో వాళ్లు బిజీ అయ్యారు. అయితే మీడియాలో సమంత తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. ‘దయాగుణాన్ని వ్యూహంగా కాకుండా.. జీవితమార్గంగా అలవరుచుకునే వారికి హ్యాట్సాఫ్‌’ అని అందులో సమంత పేర్కొంది. మరి సమంత ఈ పోస్ట్ ఎవర్ని ఉద్దేశించి పెట్టింది అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేయగా.. ‘ఒక మంచిమాట చెబితే అర్థం చేసుకోవాలి. కానీ, అందులో కూడా పెడర్థాలు తీసేవాళ్లను ఏమనలంటూ అని సమంత మళ్ళీ నెటిజన్ల పై సెటైర్‌ వేసింది.

ఏది ఏమైనా సమంత ఈ మధ్య ఇన్‌స్టా లో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. పైగా ఫుల్ ఎక్స్ పోజింగ్ తో క్రేజీ ఫోజులు ఇస్తోంది. ఇక సమంత మాట్లాడుతూ.. నా పేరెంట్స్, నా ఫ్రెండ్స్ మరియు నా దర్శకులు.. వీరు ముగ్గురూ నా మెంటర్స్‌. వారి ప్రభావం నా జీవితంపై బలంగా ఉంది’ అంటూ సమంత చెప్పుకొచ్చింది. నా ఈ సినీ జీవితంలో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నా సహా నటీనటుల నుంచైతే ఎదుటివారిని గౌరవించే విధానం, పాత్రలను ఎలా అర్థం చేసుకోవాలనే విషయాలను నేర్చుకున్నాను’ అని సమంత తెలిపింది.

అన్నట్టు సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉంది. యూఎస్ లోని ఓ ఆసుపత్రిలో సమంత చేరినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా సమంత మాట్లాడుతూ.. తనకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందుతోందని, ఇప్పుడు బాగానే ఉన్నానని సమంత తెలిపింది. సమంత త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Also Read:జైల్లో చంద్రబాబు.. ప్లాన్ లో వైసీపీ?

- Advertisement -