ధూమ్ దామ్ గా రాశీ బర్త్ డే..

250
Raashi-Khanna-
- Advertisement -

చూడ‌చక్కని అందం, ఆకట్టుకునే అభిన‌యం రాశీఖ‌న్నా సొంతం. ఈ ముద్దుగుమ్మ “ఊహాలు గుస‌గుస‌లాడే” చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. నటనతోనే కాకుండా గ్లామర్ తో యువ హృదయాలను గెలుచుకున్న అందాల భామ రాశీఖన్నా నవంబర్ 30న సినీ సెలబ్రిటీస్ మధ్య తన బర్త్ డే వేడుకలను జరుపుకుంది. ఈ బర్త్ డే వేడుకలో సెలబ్రిటీస్ కి స్పెషల్ పార్టీ ఇచ్చింది రాశీ.

raashi-bday

ఈ పార్టీలో మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లతో పాటు సందీప్ కిషన్, రవితేజ, నాగ చైతన్య, రానా, నటి రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠి తదితరులు బర్త్ డే పాల్గొన్నారు.తాజాగా రాశీ తన బర్త్ డే వేడుకలకి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాకుండా తన బర్త్ డే ఇంత స్పెషల్ గా జరగడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం తాను షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మద్రాస్ కెఫే తో వెండితెరకు పరిచయం అయిన రాశీఖన్నా తెలుగు ప్రేక్షకులకు ఊహలు గుసగుసలాడే చిత్రంతో ఇంట్రడ్యూస్ అయింది. ఇటీవల జై లవకుశ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాశీ ఖన్నా ప్రస్తుతం టచ్ చేసి చూడు, వరుణ్ తేజ్ రొమాంటిక్ ఫిలింలో నటిస్తుంది.

- Advertisement -