గ్రీన్ ఛాలెంజ్‌…మొక్కలునాటిన సినీనటి పూర్ణ..

357
green challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విరామంగా సాగుతోంది.ఒకరి నుండి మరొకరికి గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ సెలెబ్రిటీలు తమవంతుగా మొక్కలు నాటుతున్నారు. ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో ప్రముఖ సినీనటి పూర్ణ షణ్మఖాసీం గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించి మూడు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా పూర్ణ మాట్లాడుతూ… గౌరవ ఎంపీ సంతోష్ కుమార్ గారు నిర్వహిస్తున్న గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం అపూర్వమైనదని ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని ఒక ఐకానిక్ ప్రోగ్రాంగా దేశవ్యాప్తంగా మరింత ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్బంగా తనకు ఈ అవకాశాన్ని కల్పించిన ఎంపీ సంతోష్ గారికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందనీ అలాగే తను మరో ఐదుగురుకి ఛాలెంజ్ ఇస్తున్నట్టు చెప్పారు.సైబరాబాద్ సీపీ సజ్జనార్,డా.ధీరజ్,డీసీపీ సందీప్ ప్రముఖ సినీనటి ప్రియమణి అలాగే డైరక్టర్ రవిబాబులను మొక్కలు నాటాల్సిందిగా నామినేట్ చేశారు.

- Advertisement -