గ్రీన్ ఛాలెంజ్‌..మొక్కలు నాటిన భవ్యశ్రీ

90
- Advertisement -

టీఆర్‌ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ లో భాగంగా మొక్కలు నాటుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున్న పాల్గొని మొక్కలు నాటుతూ… వాటి ఏవిధంగా సంరక్షించాలో కూడా చెప్పుతూ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నటి భవ్యశ్రీ మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా భవ్యశ్రీ మాట్లాడుతూ..ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. మంచి వాతావరణం, మంచి ఆక్సీజన్ కావాలంటే ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం నిరంతరం కొనసాగాలని ఇంకా ఎన్నో మొక్కలు నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమం లో అవకాశం కల్పించినందుకు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఛాలెంజ్ లో భాగంగా నటులు భాను, ఆలీ, డైరెక్టర్ తేజ వీరి ముగ్గురిని మొక్కలు నాటాలని కోరారు.

ఇవి కూడా చదవండి..

గ్రీన్ ఛాలెంజ్‌…మొక్కలు నాటిన ధ్రువన్

15న హను-మాన్

టీటీడీ అప్‌డేట్..

- Advertisement -