గ్రీన్ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన హీరోయిన్ ఆనంది..

92
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా వరంగల్ లోని ఇండియన్ హై స్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటారు సినీనటి ఆనంది. ఈ సందర్భంగా ఆనంది మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -